రజినీకాంత్ ఆరోగ్యంపై మరో హెల్త్ బులెటిన్ను అపోలో ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంకా కొన్ని వైద్య పరీక్షల నివేదికలు రావాల్సి ఉందిన వెల్లడించారు. ఇప్పటివరకు చేసిన వైద్య పరీక్షల ఫలితాల ప్రకారం.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పరీక్షల పూర్తి నివేదికలు చూసి రేపు రజినీకాంత్ను డిశ్ఛార్జ్ చేస్తామని తెలిపారు.
స్పందించిన ప్రముఖులు..
రజినీకాంత్ ఆరోగ్యంపై తెలంగాణ గవర్నర్ తమిళసై... అపోలో వైద్యులతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ట్విటర్ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరగా కొలుకోవాలని కోరుకున్నారు.