ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 6, 2020, 5:33 PM IST

ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై రేపు 'గుడికి ఓ గోమాత' కార్యక్రమం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపు గుడికి ఓ గోమాత కార్యక్రమం జరగనుంది. తితిదే, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. రేపు ఉదయం 8.33 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొననున్నారు.

durga temple
ఇంద్రకీలాద్రిపై రేపు 'గుడికో గోమాత' కార్యక్రమం

తితిదే, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపు 'గుడికి ఓ గోమాత' కార్యక్రమం చేపట్టనున్నారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పరిధిలో అర్చన, అభిషేకాలు, యజ్ఞాల్లో వినియోగించే ప్రధాన ద్రవ్యాల కోసం.. ధర్మ ప్రచార పరిషత్తు కార్య నిర్వాహక సభ్యుడు బొమ్మదేవర వెంకటసుబ్బారావు గోవును బహూకరించారు.

తితిదే ఈ గోవును కనకదుర్గమ్మ ఆలయానికి అందజేయనుంది. రేపు ఉదయం 8.33 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతోపాటు తితిదే అధికారులు పాల్గొంటారు.

ABOUT THE AUTHOR

...view details