ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల ఘటనలో.. జవాన్లు మృతి చెందటంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వీర మరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్కౌంటర్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోవటం మరింత బాధ కలిగించిందని ఆవేదన చెందారు.
ఛత్తీస్గఢ్ ఘటనపై గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి - ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి తాజా వార్తలు
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు, జవాన్ల మృతి ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల మృతిపై ఆవేదన చెందిన ఆయన.. అమరుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి