ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 5, 2022, 9:47 PM IST

ETV Bharat / city

GOVERNOR BISWABHUSAN: 'కౌశల్.. గ్రామీణ విద్యార్థుల ప్రతిభ బయటకు తీసుకొచ్చే వేదిక'

GOVERNOR BISWABHUSAN: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం కౌశల్-2021 పేరిట రాష్ట్ర స్ధాయిలో నిర్వహించారు. క్విజ్ విజేతలకు బహుకరించే కార్యక్రమంలో గవర్నర్ వర్చువల్​గా పాల్గొన్నారు. గ్రామీణ విద్యార్థుల ప్రతిభను బయటకు తీసుకొచ్చేందుకు ఇది ఉపకరిస్తుందంటూ ఆయన ప్రశంసలు కురిపించారు.

GOVERNOR BISWABHUSAN
GOVERNOR BISWABHUSAN

GOVERNOR BISWABHUSAN IN KOUSHAL-2021: సహజ వనరులైన నీరు, నేల, వృక్ష సంపదలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ అన్నారు. వేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఔచిత్యాన్ని కలిగిన సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలను రక్షించడం, వాటిని అందరికీ వ్యాప్తి చేయడం మన కర్తవ్యమని ఆయన అన్నారు.

భారతీయ విజ్ఞాన మండలి, రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్తంగా కౌశల్-2021 పేరిట రాష్ట్ర స్ధాయి క్విజ్ పోటీలు నిర్వహించాయి. ఆన్​లైన్​ వేదికగా ఈ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. కౌశల్ కార్యక్రమాన్ని.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించటాన్ని గవర్నర్ ప్రశంసించారు.

ఇటువంటి కార్యక్రమాలు.. గ్రామీణ విద్యార్థుల ప్రతిభను బయటకు తీసుకురావడానికి వేదికగా నిలుస్తుందన్నారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అందించిన ‘జై జవాన్- జై కిసాన్’ నినాదం దేశంలో హరిత విప్లవాన్ని తీసుకురాగా.. పోఖ్రాన్ పరీక్ష తర్వాత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి ‘జై విజ్ఞాన్’ నినాదాన్ని అందించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

పోటీల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గవర్నర్ బిశ్వభూషణ్​కు తెలిపారు. ఈ కార్యక్రమం తమకు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలకు వెళ్లేందుకు ఎంతగానో ప్రేరణ కలిగించిందని విద్యార్థులు అన్నారు.

ఇదీ చదవండి:

Gannavaram Airport land victims: 'మా కష్టాలకు ఆరేళ్లు.. మా ప్లాట్లు మాకు ఇప్పించండి'

ABOUT THE AUTHOR

...view details