ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్‌అవర్ పాటించండి: గవర్నర్​

By

Published : Mar 25, 2022, 9:01 PM IST

Updated : Mar 26, 2022, 7:08 AM IST

Governor Biswabhusan on Earth Hour: మార్చి 26న ఎర్త్‌అవర్​ను పాటించాలని ప్రజలకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​ సూచించారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్‌అవర్​ను పాటించాలని ఆయన కోరారు.

governor Biswabhusan Harichandan
గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందర్

Earth Hour on March 26th: శనివారం(మార్చి 26) రాత్రి ఎర్త్‌అవర్​ను పాటించాలని రాష్ట్ర ప్రజలను గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్​ కోరారు. పర్యావరణ చైతన్యవ్యాప్తి ఉద్యమంలో భాగంగా.. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్‌అవర్ పాటించాలన్నారు. అత్యవసరమైతేనే లైట్లు, ఇతర పరికరాలు వాడాలని గవగ్నర్​ సూచించారు. ఎర్త్‌ అవర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.

భూమి మీద వెలువడుతున్న కర్బన్‌ ఉద్గారాలను తగ్గించడానికి, ఇంధనాలు, విద్యుత్‌ను ఆదా చేయడం కోసం ఏర్పడిన ప్రజాచైతన్య ఉద్యమమే ఈ ఎర్త్‌ అవర్‌. పర్యావరణ చైతన్య ఉద్యమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న(శనివారం) రాత్రి ఎర్త్‌అవర్ పాటిస్తారు. ఈ సందర్భంగా.. చారిత్రక కట్టడాలు, స్మృతి కేంద్రాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో లైట్లు ఆర్పేశారు. గంటపాటు చీకట్లలో ఉండిపోయారు. వాతావరణ మార్పుల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు గత పదేండ్లుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:Chandrababu : 'గ్రామగ్రామాన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి'

Last Updated : Mar 26, 2022, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details