ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 14, 2021, 9:39 PM IST

ETV Bharat / city

అర్చకులు, ఇమామ్​ల గౌరవవేతనాలు పెంచుతూ ఉత్తర్వులు

అర్చకులు, ఇమామ్​లు​, మౌజిన్​లకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ, దేవాదాయ శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అదేశాలు జారీ చేశారు.

government
రాష్ట్ర ప్రభుత్వం

అర్చకులు, ఇమామ్​లు, మౌజిన్​లకు గౌరవ వేతనాలు పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కేటగిరి -1 ఆలయ అర్చకుల గౌరవ వేతనాన్ని 10 వేల నుంచి 15 వేల 625కు పెంచారు. కేటగిరి-2 ఆలయాల్లోని అర్చకులకు 5 వేల నుంచి 10 వేలకు పెంచారు. మసీదుల్లో ఇమామ్​లకు గౌరవ వేతనాన్ని 5 వేల నుంచి 10 వేలకు, మౌజిన్​లకు మూడు నుంచి 5 వేలకు పెంచారు. చర్చిల్లో పాస్టర్లకు 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ, దేవాదాయ శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details