ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 1, 2021, 12:19 AM IST

ETV Bharat / city

AFFIDAVIT: నీలం సాహ్ని నియామకంలో ఉల్లంఘనలు లేవు: గోపాలకృష్ణ ద్వివేది

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా(SEC) నీలం సాహ్ని(NEELAM SAHNI)ని నియమించడంపై కోర్డులో దాఖలైన వ్యాజ్యాన్నికి.. ప్రభుత్వం తరఫున గోపాలకృష్ణ ద్వివేది కౌంటర్ దాఖలు చేశారు. ఆమె నియామకంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదని ధర్మాసనానికి తెలిపారు.

నీలం సాహ్ని నియామకంలో ఉల్లంఘనలు లేవు
నీలం సాహ్ని నియామకంలో ఉల్లంఘనలు లేవు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నీలం సాహ్ని(NEELAM SAHNI) నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కౌంటర్ అఫిడవిట్ వేశారు. ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్న వారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించరాదని మాత్రమే సుప్రీంకోర్టు(HIGH COURT) తీర్పు ఇచ్చిందన్నారు. ఆమె నియామకంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదని అన్నారు.

నీలం సాహ్ని నియామకం నాటికి ఎలాంటి ప్రభుత్వ పదవిలో లేరని వెల్లడించారు. పిటిషనర్ సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. అధికరణ 243k ప్రకారం గవర్నర్ విచక్షణ అధికారం మేరకు ఎస్ఈసీ(SEC) నియామకం జరిగిందన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాన్ని కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

SEC Neleam sahni: 'నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయండి'..హైకోర్టులో పిల్!

నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడాన్ని సవాలు చేస్తూ.. విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఇటీవల.. ఈ వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణ జులై 8 కి వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన​ కూతుళ్లు

CURFEW TIMINGS CHANGE: వారంపాటు కర్ఫ్యూ వేళల్లో మార్పులు

ABOUT THE AUTHOR

...view details