ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'108 సిబ్బందే.. ఆ బంగారం కాజేశారు' - 108 సిబ్బందే.. ఆ బంగారం కాజేశారు

రోడ్డు ప్రమాదంలో బంగారం మాయమైన కేసులో అంబులెన్స్‌ సిబ్బందే బంగారం కాజేసినట్లు పోలీసులు తేల్చారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో...మాయమైన బంగారం కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. అంబులెన్స్ డ్రైవర్ లక్ష్మారెడ్డి, టెక్నీషియన్ తాజుద్దీన్... దుర్బుద్ధితో బంగారం చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

108 staff stolen gold in peddapalli district
108 సిబ్బందే.. ఆ బంగారం కాజేశారు

By

Published : Feb 24, 2021, 9:00 PM IST

108 సిబ్బందే.. ఆ బంగారం కాజేశారు

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లి రైల్వే వంతెన వద్ద కారు బోల్తా పడి ప్రమాదం జరిగిన దుర్ఘటనలో మాయమైన బంగారాన్ని పోలీసులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారం వర్తకులు కొత్త శ్రీనివాసరావు, రాంబాబు మృతి చెందారు. దుర్ఘటనలో వారి గుమాస్తా గుండా సంతోష్‌, కారు డ్రైవర్‌ డి.సంతోష్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కొన ఊపిరితో ఉన్న రాంబాబు, జి.సంతోష్‌, డి.సంతోష్‌లను 108వాహనంలో గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల వద్ద ఉన్న బంగారం మాయమైందని వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు ఇవ్వడం సంచలనం రేపింది. ఈ కేసును సవాల్​గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.

మొత్తం 5 కిలోల 600 గ్రాములు..

బాధితులకు చెందిన మొత్తం 5 కిలోల 600 గ్రాముల బంగారం గుర్తించినట్లు సీపీ సత్యనారాయణ వెల్లడించారు. అంబులెన్సు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించగా... బంగారం దొంగిలించిన విషయాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. 108 అంబులెన్స్ డ్రైవర్ లక్ష్మారెడ్డి, టెక్నీషియన్ తాజుద్దీన్.. మృతుడి వద్ద ఉన్న బంగారం తీసుకున్నట్లు గుర్తించారు.

వ్యవస్థకే చెడ్డపేరు..

అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది నిజాయితీతో ఉండాలని... ఒకరు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చే ప్రమాదం ఉందని రామగుండం సీపీ సత్యనారాయణ హితవు పలికారు.

ఇదీ చదవండి:నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్య..మృతదేహంతో విద్యార్థుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details