ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 9, 2022, 12:39 PM IST

ETV Bharat / city

Girl Dead body found in farm : పంట పొలంలో బాలిక మృతదేహం.. కీసరలో కలకలం..

Girl Dead body found in farm : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర ఇన్వెంట ఫ్యాక్టరీ సమీపంలోని సుబాబుల్ పంట పొలంలో బాలిక మృతదేహం కలకలం సృష్టించింది. సుమారు 11 సంవత్సరాల మైనర్ మృతదేహాన్ని సుబాబుల్ పొలాల్లో గుర్తించారు.

Girl Dead body found in farm
పంట పొలంలో బాలిక మృతదేహం.. కీసరలో కలకలం...

Girl Dead body found in farm : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర ఇన్వెంట ఫ్యాక్టరీ సమీపంలోని సుబాబుల్ పంట పొలంలో బాలిక మృతదేహం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని బాలికను ఎవరైనా తీసుకొచ్చి అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు అందించిన సమాచారంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు బాలిక మృతదేహన్నీ, పరిసరాలను పరిశీలించారు. తలపైన, శరీరంపైన బలమైన గాయాలు ఉండటంతో అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించారు. బాలిక వయసు సుమారు 11 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు క్లూస్ టీంను రంగంలోకి దించారు. విచారణ పూర్తైన తర్వాతే అన్ని విషయాలను తెలియజేస్తామని డిఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details