ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 14, 2020, 7:03 PM IST

ETV Bharat / city

తెలంగాణ: గోదావరి ఒడ్డున పార్టీ.. ఈతకు దిగి నలుగురు గల్లంతు

తెలంగాణలోని ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. వెంకటాపురం మండలం పాత మరిశాల సమీపంలో గోదావరి నదిలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు.

four people missing in godavari river
తెలంగాణ: గోదావరి ఒడ్డున పార్టీ.. ఈతకు దిగి నలుగురు గల్లంతు

తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత మరిశాలలో పండుగ పూట విషాదం నెలకొంది. గోదావరి నదిలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. పుట్టినరోజు పార్టీ కోసం 20 మంది యువకులు మరిశాల సమీపంలోని గోదావరి నది వద్దకు వెళ్లారు. పార్టీ అనంతరం అందరు నదిలో ఈతకు దిగారు. అయితే ఈ క్రమంలోనే నలుగురు యువకుల గల్లంతయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలు గల్లంతయ్యారనే వార్తలు తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తెలంగాణ: గోదావరి ఒడ్డున పార్టీ.. ఈతకు దిగి నలుగురు గల్లంతు

ABOUT THE AUTHOR

...view details