ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహిళా ఉద్యోగిపై దాడి జరిగిన 4 రోజులకా స్పందించేది?: సోమిరెడ్డి

By

Published : Jun 30, 2020, 3:39 PM IST

Updated : Jun 30, 2020, 3:53 PM IST

మాస్కు పెట్టుకోవాలని చెప్పినందుకు దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగిపై క్రూరంగా దాడి చేసిన అధికారిపై దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి డిమాండ్ చేశారు.

Former minister Somireddy Chandramohan Reddy
మాజీమంత్రి సోమిరెడ్డి

మాజీమంత్రి సోమిరెడ్డి ట్విట్టర్

నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై దాడి ఘటనను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి ఖండించారు. మాస్కు ధరించాలని సూచించిన దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగిపై అధికారిననే అహంకారంతో క్రూరంగా దాడి చేయడం అమానుషమని స్పష్టం చేశారు.

ఇది క్షమించరాని నేరమన్నారు. ఇలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడానికి పర్యటక శాఖకు 4 రోజులు పట్టిందా అని నిలదీశారు. వైఎస్ జగన్ తెచ్చిన దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Last Updated : Jun 30, 2020, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details