ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అనంత' దూరం.. కుమారుల కన్నీటి సంతాపం - corona latest news

కరోనా ఆ కుమారులకు కన్నతండ్రి చివరి చూపునూ దూరం చేసింది. తండ్రి చనిపోయినా ఇంటికి రాలేక ఇద్దరు కుమారులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దుబాయ్​ నుంచి వాట్సాప్ వీడియో కాలింగ్ ద్వారా తమ తండ్రి అంత్యక్రియలు చూసి వేదన చెందారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా తాళ్లపేటలో జరిగిన ఘటన వివరాలివి..!

వాట్సప్ లోనే తండ్రి అంత్యక్రియలు చూసిన కుమారులు
వాట్సప్ లోనే తండ్రి అంత్యక్రియలు చూసిన కుమారులు

By

Published : May 5, 2020, 7:53 PM IST

Updated : May 5, 2020, 8:49 PM IST

వాట్సాప్ లోనే తండ్రి అంత్యక్రియలు చూసిన కుమారులు

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన ఎర్రం సత్తయ్య (55) అనారోగ్యంతో చనిపోయాడు. కర్మకాండలు చేయాల్సిన ఇద్దరు కొడుకులు మల్లేశ్​, అంజి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్​డౌన్ వల్ల అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. రావడానికి వీలులేని కారణంగా చేసేది ఏమి లేక వీడియో కాల్ ద్వారా తండ్రిని చివరి చూపు చూశారు.

Last Updated : May 5, 2020, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details