ఆంధ్రప్రదేశ్

andhra pradesh

FARMERS UNION: రైతులపై దాడిని నిరసిస్తూ 'మానవహారం'

By

Published : Oct 4, 2021, 5:32 PM IST

ఉత్తర్ ప్రదేశ్​లో రైతులపై జరిగిన ఘటనకు నిరసనగా రైతు నేతలు విజయవాడలో మానవహారంతో నిరసన చేపట్టారు. మోదీ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని ఆరోపించారు.

FARMERS UNION
FARMERS UNION

ఉత్తర్ ప్రదేశ్​లో రైతులపై దాడిని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు విజయవాడలో రైతు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు మానవహారంతో(farmers union agitation at vijayawada against attack on farmers at uttarpradesh) నిరసన చేపట్టారు. రైతులపై దాడి అమానుషమని.. రైతులను చంపిన కేంద్రమంత్రి కుమారుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అన్నం పెట్టే రైతులపై దాడి అంటే.. దేశం సిగ్గుతో తలదించుకునే చర్య అని మండిపడ్డారు.

మోడీ ప్రభుత్వం నియంతృత్వ పాలనతో అరాచకాలు చేస్తోందని మండిపడ్డారు. కార్మికులు, కర్షకుల పొట్ట కొట్టి కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతున్నారని సంఘం నేతలు ఆరోపించారు. రైతు ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటూ.. వారిపైనే రాక్షసంగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ దారుణ ఘటనపై తెదేపా, వైకాపా, జనసేన స్పందించాలని.. ఫాసిస్టు పాలనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details