ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 16, 2021, 7:03 AM IST

ETV Bharat / city

విచారణకు హాజరయ్యేందుకు 10 రోజులు సమయం కావాలి : దేవినేని ఉమా

కర్నూలు సీఐడీ డీఎస్పీ జారీ చేసిన నోటీసుకు మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రత్యుత్తరమిచ్చారు. విచారణకు వచ్చేందుకు మరో 10 రోజులు సమయం కావాలన్నారు.

ex minister devineni uma, devineni uma letter to kurnool cid dsp
మాజీ మంత్రి దేవినేని ఉమా, కర్నూలు సీఐడీ డీఎస్పీకి దేవినేని ఉమా లేఖ

విచారణకు హాజరు కావడం ఇప్పుడు సాధ్యంకాదంటూ.. తనకు నోటీసులు జారీ చేసిన కర్నూలు సీఐడీ డీఎస్పీకి మాజీమంత్రి దేవినేని ఉమా ప్రత్యుత్తరం పంపారు. విజయవాడ గొల్లపూడిలోని తన నివాసానికి ఉదయం 10.20కి నోటీసులు అంటించి 10.30కి కర్నూలు రమ్మనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:బంగాల్​ భాజపా అధ్యక్షుడిపై ఈసీ ఆంక్షలు

పార్టీ ఆదేశాల మేరకు తిరుపతి ఉపఎన్నికల ప్రచారం కోసం నెల్లూరులో ఉన్నట్లు ఉమా లేఖలో పేర్కొన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా.. విచారణకు హాజరయ్యేందుకు మరో 10 రోజుల సమయం కావాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details