ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

minimum time scale: గతంలో ఇచ్చిన జీవో-24వల్లే టైంస్కేల్‌ అమలులో జాప్యం: ఉన్నత విద్యామండలి - అధ్యాపకులకు కనీస టైం స్కేల్​ అమలుపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి

గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు-24 అమలులో నెలకొన్న గందరగోళంతోనే కనీస టైం స్కేల్‌ అమలులో జాప్యం జరుగుతోందని ఉన్నత విద్యామండలి(Chairman HemaChandra Reddy on minimum time scale for faculty) ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు కనీస టైం స్కేల్‌ అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన పేర్కొన్నారు.

Education Council  Chairman Hema Chandra Reddy
ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి

By

Published : Oct 24, 2021, 2:37 AM IST

విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు కనీస టైం స్కేల్‌ అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉన్నత విద్యామండలి(Education Council on minimum time scale for faculty) ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు-24 అమలులో నెలకొన్న గందరగోళంతోనే ప్రస్తుతం కనీస టైం స్కేల్‌ అమలులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. 2015 రివైజ్డ్‌ పే స్కేల్స్‌ ప్రకారం అధ్యాపకులకు కనీస టైం స్కేల్‌ ఇవ్వాలని 2019లో జారీ చేసిన ఉత్తర్వు-24లో పేర్కొన్నారు. ఈ క్రమంలో వర్సిటీ ఉద్యోగులకు యూజీసీ స్కేల్‌ వర్తిసున్నందున ఎలా వర్తింపచేయాలనే విషయంలో సందిగ్ధత(Chairman Hema Chandra Reddy on minimum time scale) నెలకొందన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో-40 తీసుకొచ్చి ఒప్పంద ఉద్యోగుల గురించి ఆలోచన చేస్తోందని వెల్లడించారు.

వాళ్లను తొలగించబోం..

సుప్రీంకోర్టు తీర్పు, 1994చట్టం ప్రకారం ఒప్పంద అధ్యాపకులను క్రమబద్దీకరించడం కుదరదని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర తెలిపారు. ఎయిడెడ్‌ సిబ్బందిలో 300మంది మాత్రమే వర్సిటీలకు అర్హత కలిగి ఉన్నారని.. వీరిని తీసుకున్నా ఒప్పంద అధ్యాపకులను ఉద్యోగాల నుంచి తొలగించమని స్పష్టంచేశారు.

ఇదీ చదవండి..

TEMPLES DESTROYED: శ్రీకాకుళం జిల్లాలో ఆలయాల కూల్చివేత.. భక్తుల ఆగ్రహం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details