డాక్టర్ రామినేని ఫౌండేషన్.. ఈ ఏడాది పురస్కారాలను ప్రకటించింది. 2021 సంవత్సరానికిగానూ.. భారత్ బయోటిక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణా ఎం. ఎల్ల, భారత్ బయోటిక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎం. ఎల్ల విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం సహా పలువురు విశేష పురస్కారానికి ఎంపికయ్యారు.
గతేడాది అవార్డులు ప్రకటించినా.. కరోనా వల్ల ప్రదానోత్సవ సభ నిర్వహించలేకపోయామని.. రామినేని ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం అన్నారు. అందువల్ల.. ఈ ఏడాది అవార్డులతో పాటు.. గతేడాది అవార్డులను కూడా ఒకే వేదికపై ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 32 రంగాలకు చెందినవారిని.. న్యాయ నిర్ణేతలు అవార్డులకు ఎంపిక చేశారన్నారు.
2021 రామినేని ఫౌండేషన్ అవార్డులు..
- విశిష్ట పురస్కారం: భారత్ బయోటిక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణా ఎం. ఎల్ల, భారత్ బయోటిక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎం. ఎల్ల
- విశేష పురస్కారం: సినీ నటులు కె. బ్రహ్మానందం, నిమ్స్ ప్రొఫెసర్, అనస్థీషియా విభాగ అధిపతి డాక్టర్ దుర్గా పద్మజా, తెలుగు సినిమా పాత్రికేయులు యస్.వి. రామారావు