ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విజయవాడ యువతి హత్య కేసులో విచారణ వేగవంతం' - తేజస్విని మర్డర్ కేసు

విజయవాడ యువతి హత్య కేసులో విచారణ వేగవంతం చేశామని దిశ ప్రత్యేకాధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్ స్పష్టం చేశారు. బాధిత యువతి కుటుంబాన్ని పరామర్శించిన అధికారులు...వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

విజయవాడ యువతి హత్య కేసులో విచారణ వేగవంతం
విజయవాడ యువతి హత్య కేసులో విచారణ వేగవంతం

By

Published : Oct 16, 2020, 7:50 PM IST

విజయవాడ యువతి హత్య కేసులో విచారణ వేగవంతం

విజయవాడలో ప్రేమోన్మాది దాడి ఘటనలో మృతి చెందిన యువతి కుటుంబ సభ్యులను దిశ ప్రత్యేకాధికారులు కృత్తికా శుక్లా, దీపికా పాటిల్ పరామర్శించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. మహిళలపై జరుగుతున్న దాడుల్లో నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాధిత యువతి కేసులో విచారణ వేగవంతం చేశామని...అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోల వాస్తవికతను నిర్ధరిస్తామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details