మధుమేహుల్లో శస్త్రచికిత్సల బారినపడే వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. వ్యాధి నియంత్రణలో ఉంచుకోకుంటే ఇన్ఫెక్షన్ల బారిన పడుతుండడం, పుండ్లు త్వరగా మానకపోవటం జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ, గుండె జబ్బులను తగ్గించేందుకు శస్త్రచికిత్సలు అనివార్యం అవుతున్నాయని అంటున్నారు. నియంత్రణలో ఉంచుకోకుండా అత్యవసరంగా శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చినప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. మధుమేహం తీవ్రత పెరిగే వరకూ సరైన శ్రద్ధ తీసుకోకపోవడం కారణంగా శస్త్రచికిత్స దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది.
చాలామందికి ఈ సంగతే తెలియటంలేదు...
మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో 50% మంది జీవితంలో ఏదో ఒక శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. దశాబ్దం కిందట 6% వరకు మాత్రమే ఈ వ్యాధిగ్రస్థులకు శస్త్ర చికిత్సలు జరిగేవి. ప్రస్తుతం 20% దాటింది. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల్లో దాదాపు 50% మందికి... అంటే ఇద్దరు వ్యాధిగ్రస్థుల్లో ఒకరికి... అసలు తమకీ సమస్య వచ్చిందన్న సంగతే తెలియటంలేదు.