ఆ వాహనాలను ఆపం...
నిత్యావసర సరకులను తరలించే వాహనాలను ఆపబోమని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. త్వరలో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లు ఇతరచోట్లకు తిరగడం వల్లే సమస్యలు వస్తున్నాయన్న డీజీపీ... విదేశాల నుంచి వచ్చినవాళ్లు హోం క్వారంటైన్ తీసుకోవాలని సూచించారు.
ఆ విషయాలు దాయడం తప్పు...
విదేశాల నుంచి వచ్చినవాళ్లు గుంటూరు, అమరావతిలో ఉన్నారని తెలిసిందని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు. వాళ్లు వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. విదేశాలకు వెళ్లి రావడం తప్పుకాదు.. ఆ విషయాలు దాయడం తప్పు అని డీజీపీ హితవు పలికారు. నిబంధనలు పాటించని 4 వేల మందిపై కేసులు పెట్టామని డీజీపీ వెల్లడించారు.