ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామతీర్థం ఘటనలో కుట్ర కోణాన్ని పరిశీలిస్తున్నాం: డీజీపీ - రామతీర్థం ఘటనపై డీజీపీ కామెంట్స్

రామతీర్థం ఘటన వెనక కుట్రకోణం ఏమైనా ఉందా? అనేది పరిశీలిస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఆ దిశగా లభించిన ఆధారాలను విశ్లేషిస్తున్నామన్నారు.

dgp on ramateerdham lord rama idol destroyed
dgp on ramateerdham lord rama idol destroyed

By

Published : Jan 7, 2021, 7:05 AM IST

రామతీర్థం ఘటనపై కుట్రకోణాన్ని పరిశీలిస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. బోడికొండపై రామాలయానికి విద్యుత్ సదుపాయం కల్పించి రెండు మూడు రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో దాడి జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆలయం, పరిసరాలు బాగా తెలిసినవారే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చు అన్న డీజీపీ.. దర్యాప్తు పురోగతిలో ఉందని వెల్లడించారు.

మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు, వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయ నిపుణుల సలహా కోరామన్న డీజీపీ.... ఈ ప్రసంగాల వల్ల సమాజంలో సామరస్యత దెబ్బతింటోందని పేర్కొన్నారు. వరుస ఘటనలు ఒక దానికి మరో దానితో సంబంధం ఏమైనా ఉందా? అని విశ్లేషిస్తున్నామన్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్ని లక్ష్యంగా చేసుకునే దాడులు జరుగుతున్నట్లు గుర్తించామని ఆయన వివరించారు.

ABOUT THE AUTHOR

...view details