ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 15, 2021, 8:28 PM IST

ETV Bharat / city

ఏవోబీలో ఆప‌రేష‌న్ పరివర్తన్‌..రూ.626 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

ఏవోబీలో ఆప‌రేష‌న్ పరివర్తన్‌ కార్యక్రమం చేపట్టి రూ. 626 కోట్ల విలువైన గంజాయి పంటను ధ్వసం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు. పోలీసులు, ఎస్​ఈబీ అధికారులు 153 బృందాలుగా ఏర్పడి 2,228 ఎక‌రాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేశామన్నారు.

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దుల్లో ఆపరేషన్ పరివర్తన్ చేపట్టినట్లు ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి స్ఫష్టం చేశారు. ఏవోబీలోని 58 గ్రామాల్లో ఆప‌రేష‌న్ పరివర్తన్‌ ద్వారా 2,228 ఎక‌రాల్లో సాగు చేస్తున్న రూ.626 కోట్ల విలువైన గంజాయి పంటను ధ్వంసం చేశామన్నారు. పోలీసులు, ఎస్​ఈబీ అధికారులు 153 బృందాలుగా ఏర్పడి ఆపరేషన్ పరివర్తన్ చేపట్టారని తెలిపారు. గంజాయి సాగు చేయకుండా అధికారులు మన్యం ప్రజ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చి లాభదాయకమైన ఇతర పంటల వైపు వారు మెుగ్గు చూపే విధంగా ప్రొత్సహిస్తున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details