ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బెట్టింగ్​ ముఠాలపై ప్రత్యేక నిఘా: డీసీసీ హర్షవర్ధన్ రాజ్ - ఐపీఎల్ బెట్టింగ్ వార్తలు

దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి మొదలైంది. అయితే ఐపీఎల్‌పై ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను ‘క్యాష్’ చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో... పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్​పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పుతున్న డీసీపీ హర్షవర్ధన్ రాజ్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

DCP Harshavardhan Raj said that special surveillance has been set up on cricket betting.
డీసీసీ హర్షవర్ధన్ రాజ్​

By

Published : Sep 21, 2020, 2:45 PM IST

ఐపీఎల్ జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలను అడ్డాగా మార్చుకొని... బెట్టింగ్​లకు పాల్పడుతున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక సాఫ్ట్​వేర్​తో ఆన్​లైన్​లోనే బెట్టింగ్ నిర్వహిస్తున్నారని గుర్తించారు. బెట్టింగ్​కు ఉపయోగించిన 25 సెల్​ఫోన్లు, ఎసీడీ, ల్యాఫ్​టాప్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్​పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డీసీపీ హర్షవర్ధన్ రాజ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details