ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బెజవాడ దుర్గమ్మ సేవలో సీఎస్ సుబ్రమణ్యం దంపతులు

మహిషాసుర మర్ధిని రూపంలో ఉన్న బెజవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో ప్రభుత్వ సీఎస్ ఎల్.వీ సుబ్రమణ్యం అమ్మవారిని దర్శించుకున్నారు.

By

Published : Oct 7, 2019, 10:53 AM IST

Updated : Oct 7, 2019, 1:08 PM IST

దుర్గమ్మ సేవలో సీఎస్

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మహిషాసుర మర్ధిని రూపంలో ఉన్న అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వీ.సుబ్రమణ్యం దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో దుర్గమ్మను దర్శించుకున్న సీఎస్ కు ఆలయ వేదపండితులు దివ్యాశీర్వచనలు అందజేశారు.
కొనసాగుతున్నరద్దీ
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. జగన్మాతను దర్శించుకునేందుకు భవానీలు బారులు తీరుతున్నారు. కేశఖండనశాల వద్ద కూడా రద్దీ పెరిగింది.

దుర్గమ్మ సేవలో సీఎస్
Last Updated : Oct 7, 2019, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details