బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఉన్న మిరపకాయలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను వర్షం పాడుచేసిందని రైతులు ఆవేదన చెందారు.వట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల్లో మోస్తరు జల్లులు కురిశాయి.
నెల్లూరు జిల్లాలో..
నాయుడుపేటలో కురిసిన వర్షాలకు ధాన్యం తడవడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.నాయుడుపేట పరిసరాల్లో వరి నూర్పిడి జోరుగా సాగుతోంది.అకాల వర్షం కారణంగాతీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.