ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 22, 2021, 5:30 PM IST

ETV Bharat / city

'అమరావతి రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలి'

మూడు రాజధానుల బిల్లును( three capital act) ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్వాగతించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు(cpi-ramakrishna comments three capital act). అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత 705 రోజులుగా నిర్విరామంగా సాగుతున్న పోరాటానికి ఇది తొలి విజయంగా ఆయన పేర్కొన్నారు. అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ కోరారు.

అమరావతి రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. 3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది(ap high court repeal the three-capital bill). వివరాల సమర్పణకు కొంత సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ కోర్టును కోరారు. శుక్రవారంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

3 రాజధానులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైకోర్టుకు తెలిపిన ఏజీ

రాజధాని వాజ్యాలపై వరుసగా ఆరో రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉదయం విచారణ ప్రారంభించింది. పిటిషనరు తరఫు న్యాయవాదులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్న సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ ప్రభుత్వ వైఖరిని ధర్మాసనానికి తెలియజేశారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు(ap govt repeal controversial three capitals law). ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం రీపీల్‌ బిల్లును ధర్మాసనం ముందు ఉంచేందుకు సమయం కోరారు. దీంతో విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేశారు. తిరిగి హైకోర్టులో విచారణ ప్రారంభమైనా... అప్పటికీ శాసనసభలో ప్రభుత్వం ఈ బిల్లుల విషయంలో ప్రకటన చేయలేదు. పూర్తి వివరాలు సమర్పించేందుకు తమకు కొంత సమయం కావాలని ఏజీ కోరారు. శుక్రవారంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

వికేంద్రీకరణకు మెరుగైన బిల్లు..

మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం (Three Capitals repeal bill) ఉపసంహరించుకున్నట్లు పీటీఐ వార్త సంస్థ కథనం వెలువరించింది. వికేంద్రీకరణకు మరింత మెరుగైన బిల్లు తెస్తామని సీఎం జగన్ శాసనసభలో స్పష్టం చేసినట్లు వెల్లడించింది. 2020 నాటి చట్టం స్థానంలో కొత్త బిల్లు తెస్తామని.. విస్తృత ప్రజాప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమని సీఎం ప్రకటించారు. వికేంద్రీకరణపై అనేక అపోహలు, అనుమానాలు వచ్చాయని వెల్లడించిన సీఎం.. వికేంద్రీకరణపై న్యాయపరమైన వివాదాలు వచ్చాయన్నారు. చట్టాన్ని మరింత మెరుగ్గా తెచ్చేందుకే ఈ నిర్ణయమని తెలిపిన ముఖ్యమంత్రి.. వికేంద్రీకరణే తమ ప్రభుత్వ అసలైన ఉద్దేశమని సీఎం తెలిపినట్లు పీటీఐ వెల్లడించింది.


ఇదీ చదవండి:

TULLURU FARMERS: మిఠాయిలు పంచుకున్న తుళ్లూరు రైతులు..!

ABOUT THE AUTHOR

...view details