ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నగరవాసులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం' - undefined

విజయవాడ రెడ్​ జోన్​ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని నగర సీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. నిత్యావసర సరకులకు ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు.

cp dwaraka tirumala rao visits red zones in vijayawada
లాక్​డౌన్​పై మాట్లాడుతున్న ద్వారకా తిరుమల రావు

By

Published : Apr 13, 2020, 4:31 PM IST

విజయవాడ నగర పరిధిలోని పాయకాపురం, శాంతినగర్ రెడ్ జోన్ ప్రాంతాలను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు సందర్శించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో స్థానిక పోలీసులు తీసుకుంటున్న భద్రత చర్యలను పరిశీలించారు. నగర వ్యాప్తంగా ఆరు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి ఆయా ప్రాంతాల్లో కరోనా నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని సీపీ అన్నారు. నిత్యావసర సరకులు, కూరగాయలు అవసరాలకై త్వరలో మొబైల్ దుకాణాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో నగర వాసులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. లాక్​డౌన్​ నిబంధనల కొంతమంది అతిక్రమిస్తున్నారని.. వారిపై కేసులు నమోదు చేస్తున్నామని సీపీ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details