ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vaccine: రాష్ట్రానికి చేరుకున్న 3.12 లక్షల కొవిడ్ టీకా డోసులు - టీకా డోసులు తాజా వార్తలు

రాష్ట్రానికి మరో 3.12 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకాలను నిల్వ కేంద్రానికి తరలించారు.

COVISHIELD VACCINE DOSES REACHED TO GANNAVARAM
రాష్ట్రానికి చేరుకున్న 3.12 లక్షల కొవిడ్ టీకా డోసులు

By

Published : Jun 22, 2021, 9:54 PM IST

రాష్ట్రానికి మరో 3.12 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. దిల్లీ నుంచి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 26 బాక్సుల్లో టీకాలు తీసుకువచ్చారు. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్​ను తరలించారు. అక్కడినుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నారు. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం లభించనుంది.

ABOUT THE AUTHOR

...view details