రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదవుతూనే ఉన్నాయి. జర్మనీ నుంచి గన్నవరం వచ్చిన ఓ వ్యక్తిని పరీక్షించిన వైద్య బృందం వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించి.. అతన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
గన్నవరం విమానాశ్రయంలో కరోనా కేసు..? ఆస్పత్రికి తరలింపు - corona latest filed case in ap
రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే నెల్లూరులో ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు నిర్ధరణ కాగా .. జర్మనీ నుంచి గన్నవరం వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే అతన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
గన్నవరం విమానాశ్రయంలో కరోనా కేసు..? ఆస్పత్రికి తరలింపు