ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడ రైల్వే డివిజన్​పై కరోనా ప్రభావం: తగ్గిన ఆదాయం

By

Published : Apr 10, 2021, 10:51 AM IST

ఆదాయ ఆర్జనలో ముందుండే విజయవాడ డివిజన్... కొవిడ్ దెబ్బతో వెనుకబడింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 21 శాతం తక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. సరకు రవాణాను తగ్గించడం వల్లే ఆదాయం తగ్గినట్లు విజయవాడ డీఆర్​ఎం శ్రీనివాస్ తెలిపారు.

విజయవాడ రైల్వే డివిజన్​పై కరోనా ప్రభావం
విజయవాడ రైల్వే డివిజన్​పై కరోనా ప్రభావం

కరోనా ప్రభావం... రైల్వే ఆదాయంపై గణనీయంగా పడింది. ఆదాయ ఆర్జనలో ఏటా ముందుండే విజయవాడ డివిజన్... కొవిడ్ దెబ్బతో వెనుకబడింది. గతేడాది మార్చి నుంచి ఏప్రిల్ వరకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2వేల 494 కోట్లు ఆదాయాన్ని మాత్రమే నమోదు చేసింది. వీటిలో సరకు రవాణా ద్వారా రూ. 2వేల 197.27 కోట్లు ఆదాయం ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 21 శాతం తక్కువ. లాక్​డౌన్ కారణంగా సరకు రవాణాను తగ్గించడం వల్లే ఆదాయం తగ్గినట్లు విజయవాడ డీఆర్​ఎం శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు.

గతేడాది ప్రయాణికుల రవాణా ద్వారా విజయవాడ డివిజన్ రూ. 219.84 కోట్లు మాత్రమే ఆర్జించింది. డివిజన్ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసినట్లు చెప్పారు. విజయవాడ రైల్వేస్టేషన్​ను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. డివిజన్​లో పెండింగ్​లో ఉన్న నిర్మాణాలు సహా డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులను పూర్తి చేశామని... మిగిలినవి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details