ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 26, 2021, 6:30 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 96 కరోనా కేసులు.. ఒకరు మృతి

రాష్ట్రంలో కొత్తగా 96 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,681కు చేరింది. కొవిడ్ నుంచి మరో 71 మంది బాధితులు కోలుకున్నారు.

corona cases in ap
రాష్ట్రంలో కొత్తగా 96 కరోనా కేసులు... ఒకరు మృతి

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 96 మందికి కరోనా సోకింది . అత్యధికంగా చిత్తూరులో 22 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 5, కృష్ణాలో 9, గుంటూరులో 17, తూర్పు గోదావరి జిల్లాలో 7, అనంతపురం 6, నెల్లూరు 9, కడపలో 6, శ్రీకాకుళంలో 4, పశ్చిమగోదావరిలో 4, విజయనగరంలో 4, కర్నూలులో 3కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,681కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 635గా వైద్యాధికారులు తెలిపారు.

గడచిన 24 గంటల వ్యవధిలో 71 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,81,877 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ఒకరు మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,169 కి చేరింది. 24 గంటల వ్యవధిలో 34,778 కరోనా పరీక్షలు చేయగా... ఇప్పటివరకు 1,38,77,968 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

రాష్ట్రంలో కొత్తగా 96 కరోనా కేసులు... ఒకరు మృతి

ఇదీ చదవండి

పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details