ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP CORONA : నిలకడగా కేసులు... కొత్తగా 246మందికి కొవిడ్ పాజిటివ్

By

Published : Nov 8, 2021, 5:26 PM IST

రాష్ట్రంలో కరోనా కేసుల(corona cases in andhrapradhesh) ఉద్ధృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 246 కరోనా పాజిటివ్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3,366 కొవిడ్ యాక్టివ్‌ కేసులు(corona active cases) ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 28,855 మందికి కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా... కొత్తగా 246 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో నలుగురు(four people died with corona virus) మరణించారు. కరోనా నుంచి మరో 334 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,366 కొవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

జిల్లాల వారీగా కరోనా మరణాలు, కేసులు...

కరోనా కారణంగా గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. చిత్తూరులో 41, తూర్పుగోదావరిలో 80, గుంటూరులో 31, కడపలో 13, కర్నూలులో 1, నెల్లూరులో 11, ప్రకాశంలో 10, శ్రీకాకుళంలో 14, విశాఖపట్నంలో 29, విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో ఒక్క కేసూ నమోదు కాలేదు.

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details