ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP CORONA CASES : రాష్ట్రంలో కొత్తగా 150 కరోనా కేసులు, 3 మరణాలు

By

Published : Nov 5, 2021, 4:38 PM IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య(corona cases in andhrapradhesh) నిలకడగా కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 150 కొవిడ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,760 కరోనా యాక్టివ్‌ కేసులు(corona active cases) ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 23,824 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా... కొత్తగా 150 కొవిడ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 217 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,760 కరోనా యాక్టివ్‌ కేసులు(corona active cases) ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాలు..

కరోనా కారణంగా చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అనంతపురంలో 4, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 20, గుంటూరులో 28, కడపలో 9, కృష్ణాలో 24, కర్నూలులో 2, నెల్లూరులో 6, ప్రకాశంలో 5, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 20, విజయనగరంలో 2, పశ్చిమగోదావరిలో 13 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details