ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో కొత్తగా 4,074 కరోనా కేసులు, 54 మరణాలు

By

Published : Jul 20, 2020, 6:38 PM IST

Updated : Jul 20, 2020, 7:30 PM IST

corona cases in andhrapradesh
corona cases in andhrapradesh

14:41 July 20

వైరస్ కారణంగా మరో 54 మంది మృతి

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. కొత్తగా 4,074 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  మెుత్తం బాధితుల సంఖ్య 53,724కు చేరింది. వైరస్​తో మరో 54 మంది మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 696కు చేరింది. 24 గంటల వ్యవధిలో 33,580 కొవిడ్‌ నమూనాలు పరీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 లక్షల 49 వేల 112 మందికి కరోనా పరీక్షలు చేశారు.

 జిల్లా నమోదైన కేసులు
తూర్పు గోదావరి 1,086
కర్నూలు 559
గుంటూరు 596
పశ్చిమ గోదావరి 354
అనంతపురం 342
శ్రీకాకుళం 261
ప్రకాశం 221
కడప 152
కృష్ణా 129
చిత్తూరు 116
విశాఖ 102
నెల్లూరు 100
విజయనగరం 56

వైరస్ కారణంగా తూర్పు గోదావరి,  గుంటూరు జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందగా..కృష్ణాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఆరుగురు మృతి బలయ్యారు. చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున..  కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.

Last Updated : Jul 20, 2020, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details