ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ధరలు తగ్గించాలని కాంగ్రెస్​ డిమాండ్.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

By

Published : Jul 13, 2021, 5:26 PM IST

పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు (Congress protests) చేపట్టింది. విశాఖలో పార్టీ నాయకులు.. భిక్షాటన చేసి పెరిగిన ధరలపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు.

Congress statewide protests on petrol price
ట్రో ధరలపై కాంగ్రెస్ నిరసనలు

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ.. విజయవాడలో కాంగ్రెస్ ఆందోళన(Congress protests)కు దిగింది. ఎంజీ రోడ్డులోని పెట్రోల్ బంక్ ఎదుట చేపట్టిన నిరసనలో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, ఇతర నేతలు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయని.. ట్యాక్సీల పేరిట దోచుకోవడం ఆపితే ధరలు దిగివస్తాయని శైలజానాథ్​ అన్నారు. పెట్రో ధరల మంటకు నిరసనగా ఈనెల 17న కర్నూలులో భారీ సైకిల్ యాత్ర చేపడతామన్నారు.

విశాఖలో భిక్షాటన..

పెరిగిన ధరలు తగ్గిచాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ధరల పెరుగుదలను తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఏ.నారాయణరావు పాల్గొన్నారు. నగర కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొడిబోయిన పరదేసి ఆధ్వర్యంలో సీతంపేటలోని దుర్గ వినాయక ఆలయం నుంచి భిక్షాటన చేశారు.

కరోనా కష్టకాలంలో ప్రజలకు అన్ని దేశాలు రాయితీలు ప్రకటిస్తుంటే.. భారతద్​లో మాత్రమే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. భిక్షాటన చేసి.. అడ్డూ అదుపు లేకుండా పెరిగిన ధరలపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు. వెంటనే ధరలు అదుపు చేయకపోతే ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి..

శాప్‌ మాజీ ఛైర్మన్‌ పి.ఆర్‌.మోహన్‌ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సంతాపం

ABOUT THE AUTHOR

...view details