ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు అమలు చేయాలి' - ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై సీఎంకు తులసిరెడ్డి లేఖ వార్తలు

అగ్ర కులాల్లోని పేద కుటుంబాల యువతకు ఉద్యోగావకాశాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు.

congress leader tulasireddy letter to cm jagan on ews reservations
తులసిరెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్

By

Published : Jul 5, 2020, 1:57 PM IST

అగ్ర కులాల్లోని పేద యువతకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం ఈడబ్యూఎస్ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కాపు, తెలగ, బలిజ, ఒరిటరి, రెడ్ది, కమ్మ, వెలమ, జాట్, రాజ్​పుత్, సయ్యద్, మొగల్, పఠాన్ తదితర అగ్రకులాలకు చెందిన పేద కుటుంబాల్లో ప్రతిభావంతులైన నిరుద్యోగ యువత ఉందన్నారు. వీరికి ఈడబ్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని తులసిరెడ్డి.. ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు.

2019 ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయన్న తులసిరెడ్డి.. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. జీవో 60 ద్వారా ప్రభుత్వ విద్యాలయాల్లోనూ ఇది ఉందన్నారు. వెంటనే ఉద్యోగాల్లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details