ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ మద్యం పట్టివేత.. రూ.1.24 లక్షల సరుకు స్వాధీనం - విజయవాడలో తెలంగాణ మద్యం పట్టివేత

తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యాన్ని విజయవాడలోని హనుమాన్ జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఈబీ ఏఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

విజయవాడలో తెలంగాణ మద్యం పట్టివేత
విజయవాడలో తెలంగాణ మద్యం పట్టివేత

By

Published : May 22, 2021, 2:20 PM IST

గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ నుంచి తరలిస్తున్న లక్షా 24 వేల రూపాయల విలువగల మద్యాన్ని.. విజయవాడలోని హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఈబీ ఏఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సరిహద్దు నుంచి ఈ మద్యాన్ని తరలిస్తున్నట్లుగా గుర్తించామని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, జంక్షన్‌ సీఐ రమణ, ఎస్‌ఐలు గౌతమ్‌, ఉషారాణి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details