ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జిల్లాకో క్యాంపు కార్యాలయం...ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ సీఎంవోకు ఉంది'

ముఖ్యమంత్రి ప్రస్తుత క్యాంపు కార్యాలయం నుంచే పనిచేయాలని పట్టుబట్టే హక్కు పిటిషనర్లకు లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు హైకోర్టులో కౌంటరు దాఖలుచేశారు. ప్రతి జిల్లాలో క్యాంపు కార్యాలయం బస/వసతి ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉందన్నారు.

By

Published : Oct 11, 2020, 5:20 AM IST

జిల్లాకో క్యాంపు కార్యాలయం
జిల్లాకో క్యాంపు కార్యాలయం

సీఎం ప్రస్తుత క్యాంపు కార్యాలయం నుంచే పనిచేయాలని పట్టుబట్టే హక్కు పిటిషనర్లకు లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు హైకోర్టులో కౌంటరు దాఖలుచేశారు. ప్రతి జిల్లాలో క్యాంపు కార్యాలయం బస/వసతి ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉందన్నారు.అమరావతి నుంచి కార్యాలయాల తరలింపును నిలువరించాలని కోరుతూ ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ కార్యదర్శి ధనేకుల రామారావు, మరొకరు హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల జరిగిన విచారణలో సీఎం క్యాంపు కార్యాలయం, కార్పొరేషన్ల కార్యాలయాలపై స్పష్టత ఇస్తూ కౌంటరు వేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు హైకోర్టులో కౌంటరు దాఖలు చేశారు.

కౌంటరులోని వివరాలు ఇలా..

‘పాలనా వికేంద్రీకరణ చట్టంలోని సెక్షన్‌ 8లో అంశాలను మించి పిటిషనర్‌ అభ్యర్థించారు. సీఎం క్యాంపు కార్యాలయం ఒకచోటే ఉండాలనేది చట్టబద్ధమైంది కాదు. ‘క్యాంపు ఆఫీసు’ అనే పదానికి ఏపీ సీఆర్‌డీఏ లేదా రాజధాని బృహత్తర ప్రణాళిక ప్రకారం చట్ట నిబంధనలు వర్తించవు. బృహత్తర ప్రణాళికలో పేర్కొన్న నగరాల్లోనూ సీఎం క్యాంపు ఆఫీసు, దాని స్థానాన్ని సూచించలేదు. ప్రస్తుత క్యాంపు కార్యాలయం నుంచే ముఖ్యమంత్రి పనిచేయాలని పట్టుబట్టే హక్కు పిటిషనర్లకు లేదు. ఇతర జిల్లాల్లో వసతులు ఉండకూడదని చెప్పడానికి వీల్లేదు. అందువల్ల అనుబంధ పిటిషన్‌ను కొట్టేయండి’ అన్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి, కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని వివిధ కార్పొరేషన్ల కార్యాలయాలకు యథాతథ స్థితి (స్టేటస్‌ కో)ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు.

ఆ అనుబంధ పిటిషన్‌ను అనుమతించకండి: దమ్మాలపాటి

రాజధాని భూముల విషయంలో అవినీతి నిరోధక శాఖ (అనిశా) నమోదు చేసిన కేసు వివరాలను ప్రసార మాధ్యమాలు బహిర్గతం చేయకుండా నిలువరిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని, తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని (ఇంప్లీడ్‌) న్యాయవాది మమతారాణి వేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించొద్దని మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో కౌంటరు వేశారు. హైకోర్టు ఉత్తర్వులతో మమతారాణి హక్కులు ప్రభావితం కావన్నారు. మధ్యంతర ఉత్తర్వులను సవరించాల్సిన అవసరం లేదన్నారు.

ఇదీచదవండి

రహదారులు రివైజ్డ్​ బిడ్డింగ్ నిబంధనల్లో మార్పులు

ABOUT THE AUTHOR

...view details