ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 21, 2022, 9:49 PM IST

ETV Bharat / city

ఈనెల 23న తిరుపతి జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్​

CM jagan Tirupati Tour: ఈనెల 23(గురువారం)న తిరుపతి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి జిల్లాలో జరగనున్న వివిధ కార్యక్రమాలల్లో సీఎం పాల్గొంటారు.

CM JAGAN TIRUPATI TOUR
CM JAGAN TIRUPATI TOUR

ముఖ్యమంత్రి జగన్.. ఈనెల 23న(గురువారం) తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం పేరూరు చేరుకుంటారు. 11.15 నుంచి 11.45 గంటల వరకు శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుంటారు. అక్కడ హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌.. అపాచీ పాదరక్షల తయారీ యూనిట్‌ నిర్మాణ పనులకు సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో జగన్​ పాల్గొంటారు.

అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ వద్ద చేరుకొని అక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈమేరకు జగన్​ పర్యటన షెడ్యూల్​ను అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఇంకా సమయం ఉంది.. ఏ నిర్ణయమూ తీసుకోలేదు: ఎంపీ పిల్లి

ABOUT THE AUTHOR

...view details