ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రానికి ఆక్సిజన్ పంపిస్తున్న సంస్థలకు కృతజ్ఞతలు: సీఎం

By

Published : May 24, 2021, 10:58 PM IST

రాష్ట్రానికి ఆక్సిజన్‌ పంపిస్తున్న సంస్థలకు సీఎం జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కష్ట సమయంలో అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు.

రాష్ట్రానికి ఆక్సిజన్ పంపిస్తున్న సంస్థలకు కృతజ్ఞతలు: సీఎం
రాష్ట్రానికి ఆక్సిజన్ పంపిస్తున్న సంస్థలకు కృతజ్ఞతలు: సీఎం

రాష్ట్రానికి ఆక్సిజన్ పంపిస్తున్న రిలయన్స్‌, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్స్‌కు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ రిలయన్స్ అండదండలు కొనసాగాలని కోరారు. టాటా స్టీల్‌ ఇప్పటివరకు ఏపీకి వెయ్యి టన్నుల ఆక్సిజన్‌ పంపిందని సీఎం వెల్లడించారు. రాయలసీమ ప్రాంతానికి సజ్జన్ జిందాల్‌ ఆక్సిజన్ పంపారని తెలిపారు. రాష్ట్రానికి 500 టన్నుల ఆక్సిజన్‌ను నవీన్ జిందాల్‌ పంపారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details