ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రమ్య కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్​

By

Published : Aug 15, 2021, 9:14 PM IST

గుంటూరులో యువతి రమ్య హత్య కేసు పురోగతిపై సీఎం జగన్​ ఆరా తీశారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

CM JAGAN
CM JAGAN

గుంటూరులో యువతి రమ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. యువతి హత్యా ఘటన, కేసు పురోగతిపై సీఎం ఆరా తీశారు. హత్య ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

‘దిశ చట్టం’ కింద దర్యాప్తు వేగంగా చేపట్టి దోషికి కఠినశిక్ష పడేలా చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిహారంగా రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని యువతి కుటుంబానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details