ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ద్రోణం రాజు శ్రీనివాస్ మృతిపై దిగ్భ్రాంతి - ద్రోణం రాజు శ్రీనివాస్ మృతి

మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత ద్రోణం రాజు శ్రీనివాస్​ మృతిపై ముఖ్యమంత్రి జగన్, తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ద్రోణంరాజు మృదు స్వభావం, నిబద్ధత కలిగిన నాయకుడని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ద్రోణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ద్రోణం రాజు శ్రీనివాస్ మృతి పట్ల సీఎం దిగ్ర్భాంతి
ద్రోణం రాజు శ్రీనివాస్ మృతి పట్ల సీఎం దిగ్ర్భాంతి

By

Published : Oct 4, 2020, 7:39 PM IST

Updated : Oct 4, 2020, 10:22 PM IST

మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృదువైన స్వభావం, నిబద్ధత కలిగిన నాయకుడని శ్రీనివాస్​ను కొనియాడారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ద్రోణం రాజు కుటుంబం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

మాజీ శాసనసభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్ మృతికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం విచారకరమన్నారు. ద్రోణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Last Updated : Oct 4, 2020, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details