ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు కన్నుమూత

By

Published : Jul 22, 2020, 4:13 PM IST

Published : Jul 22, 2020, 4:13 PM IST

Updated : Jul 22, 2020, 5:05 PM IST

Atchutharao died
Atchutharao died

16:09 July 22

కరోనాతో అచ్యుతరావు కన్నుమూత

బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన... హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచారు. బాలల హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేసిన అచ్యుతరావు.. బాల కార్మికులకు సంబంధించి అనేక పోరాటాలు చేశారు. అనేక మంది బాలబాలికలకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు. దశాబ్దాలుగా చిన్న పిల్లల సమస్యలపై పోరాడారు. సీపీఐ అనుబంధ బాలల సంఘంలోనూ చురుగ్గా  ఉండేవారు.

బాలల సంరక్షణ పోరాటాల్లో అచ్యుతరావుది కీలక పాత్రః సీపీఐ నారాయణ

అచ్యుతరావు మృతి పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్యుతరావు కొవిడ్ రక్కసికి ఆహుతి అయిపోయాడన్నారు. బాలల ఉద్యమానికి చేసిన సేవలు మరువలేనివని నారాయణ గుర్తు చేసుకున్నారు. అచ్యుతరావు కుటుంబంతో దశాబ్దల అనుబంధముందని... వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Last Updated : Jul 22, 2020, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details