ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 10, 2019, 11:56 PM IST

ETV Bharat / city

చిన్నారి 'కిడ్నాప్'.. విజయవాడలో మహిళపై అనుమానం!

విజయవాడ నగరంలో చిన్నారిని కిడ్నాప్ చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దృశ్యాలు కలకలం రేపాయి. బస్సులో చిన్నారిని ఓ మహిళ తీసుకెళ్తుండటంతో ప్రయాణికులు ఆమెను ఆరా తీశారు. తర్వాత ఏం జరిగిందంటే!

చిన్నారి కిడ్నాప్ అంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో

చిన్నారి కిడ్నాప్ అంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో

విజయవాడలో చిన్నారిని కిడ్నాప్ చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దృశ్యాలు నగరవ్యాప్తంగా కలకలం రేపాయి. పటమట పీఎస్ పరిధిలో ఓ మహిళ తన కుమారుడుని బస్సులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. అనుమానం వచ్చిన ప్రయాణికులు ఆ మహిళను అనుమానించి వివరాలు అడిగారు. సరిగా సమాధానం చెప్పని కారణంగా.. పటమట పోలీసులకు సమాచారమందించారు. చిన్నారిని కిడ్నాప్​ చేశారంటూ... సామాజిక మాధ్యమాల్లో దృశ్యాలను పొందుపరిచారు. కాసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు ఆ మహిళను విచారించగా.. బాలుడి తల్లి అని తేలింది.

ABOUT THE AUTHOR

...view details