Jagan delhi tour: ముఖ్యమంత్రి జగన్ రేపు దిల్లీ వెళ్లే అవకాశం - సీఎం జగన్ తాజా వార్తలు
![Jagan delhi tour: ముఖ్యమంత్రి జగన్ రేపు దిల్లీ వెళ్లే అవకాశం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12070227-1088-12070227-1623228328478.jpg)
13:43 June 09
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం
ముఖ్యమంత్రి జగన్ రేపు దిల్లీ వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్లు సమాచారం. పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. 3 రాజధానుల ఏర్పాటుపై సహకరించాలని అమిత్ షాను కోరనున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికసాయం చేయాలని కోరే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో చర్చించనున్నట్లు సమచారాం.
ఇదీ చదవండి:YSR Beema: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!