ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అన్నం పెట్టే అన్నదాతలపై అక్రమ కేసులా..? : చంద్రబాబు - చంద్రబాబు న్యూస్

వైకాపా ప్రభుత్వ అరాచకాలు రోజుకోజుకీ పేట్రేగి పోతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నపూర్ణగా పేరొందిన రాష్ట్రంలో అన్నదాతలపై అక్రమ కేసులు సిగ్గుచేటన్నారు. విజయనగరం రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తేసి.. తక్షణమే బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ నియంతృత్వం సరికాదు
ప్రభుత్వ నియంతృత్వం సరికాదు

By

Published : Nov 4, 2021, 7:39 PM IST

విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలో చెరకు బకాయిలు చెల్లించాలని నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ అరాచకాలు రోజుకోజుకీ పేట్రేగి పోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నపూర్ణగా పేరొందిన రాష్ట్రంలో అన్నదాతలపై అక్రమ కేసులు సిగ్గుచేటన్నారు.

బకాయిలు చెల్లించాలని కోరిన రైతులపై కేసులు పెట్టడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్యాయానికి గురైన రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే.. నియంతలా వ్యవహరించటం సరికాదని హితవు పలికారు.

రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. తమ సమస్యలపై నిరసన తెలిపిన రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. విజయనగరం రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తేసి.. తక్షణమే బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి

Remond: చెరుకు రైతుల ఆందోళనలో అరెస్టైన నేతలకు 14 రోజుల రిమాండ్

ABOUT THE AUTHOR

...view details