ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రత్యేక హోదాపై నాడేం చెప్పారు... నేడు ఏం చేస్తున్నారు : చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత విభేదాలు లేవని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యనించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోదీతో పోరాడానని తెలిపారు. ప్రత్యేక హోదా, ఇతర కేంద్ర హామీలపై నాడు ముఖ్యమంత్రి జగన్ చెప్పిందేంటి.., ఇప్పుడు చేసేదేంటని నిలదీశారు.

By

Published : Jun 16, 2020, 8:09 PM IST

ప్రధాని మోదీతో వ్యక్తిగత విభేదాలు లేవు: చంద్రబాబు
ప్రధాని మోదీతో వ్యక్తిగత విభేదాలు లేవు: చంద్రబాబు

రాష్ట్ర ప్రయోజనాలక కోసం పోరాడానే తప్ప తనకు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత విభేదాలు లేవని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, ఇతర కేంద్ర హామీలపై నాడు ముఖ్యమంత్రి జగన్ చెప్పిందేంటి.., ఇప్పుడు చేసేదేంటని నిలదీశారు.

మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులు మళ్లీ తీసుకురావటం తప్పుడు విధానమని మండిపడ్డారు. శాసన మండలి ఇప్పటికే సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన బిల్లును మళ్లీ ఎలా తెస్తారని ధ్వజమెత్తారు. మండలిలోనూ మళ్లీ బిల్లుల ప్రవేశపెట్టడంపై గట్టిగా పోరాడతామన్న చంద్రబాబు.., ఇందులో రెండో ఆలోచనే లేదని తేల్చి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details