ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tribute to potti sriramulu: 'ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు' - పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా లోకేశ్ నివాళులు

TDP Tribute to Potti Sriramulu: ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని.. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములుకు చంద్రబాబు నివాళులు అర్పించారు.

chandrababu and lokesh tributes to potti sriramulu on his birth anniversary
పొట్టి శ్రీరాములు జయంతి

By

Published : Mar 16, 2022, 10:36 AM IST

Updated : Mar 16, 2022, 7:40 PM IST

Chandrababu Tribute to Potti Sriramulu: వైకాపా ప్రభుత్వం వ్యాపారులను తీవ్రంగా వేధిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని.. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు చంద్రబాబు, లోకేశ్​, అచ్చెన్నాయుడు నివాళులు అర్పించారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు నిత్యం స్మరణీయులని చంద్రబాబు కొనియాడారు.

రోశయ్యకు అంజలి ఘటించేందుకూ జగన్‌కు మనసు రాలేదని, తెదేపా అధికారంలోకి వచ్చాక రోశయ్యకు తగిన గౌరవం ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అయితే.. తమపై వేధింపులు జరుగుతున్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య నేతలు వాపోయారు.

అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి​ అంజలి ఘటించారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని పోరాడిన గొప్ప అభ్యుదయవాదుడని లోకేశ్ కొనియాడారు.

ఇదీ చదవండి:

Yadadri Temple: ఉద్ఘాటన పర్వానికి సిద్ధమవుతోన్న యాదాద్రి ఆలయం

Last Updated : Mar 16, 2022, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details