వరుసబెట్టి ప్రజల ప్రాణాలు హరిస్తున్న ప్రమాదాలు మనసును కలచివేస్తున్నాయి. విశాఖలో విషవాయువు 12 మందిని బలి తీసుకున్న ఘటన జరిగి వారం తిరక్కముందే ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర మరో ఘోరప్రమాదంలో 9 మంది వ్యవసాయకూలీలు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరణించిన వారంతా కూలీలు కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారి కుటుంబాలకు అండగా నిలవాలి. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలి.
-నారా చంద్రబాబు నాయుడు