ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 1, 2021, 8:17 PM IST

Updated : Mar 4, 2021, 4:14 PM IST

ETV Bharat / city

అక్కడ నామినేషన్లు వేసేందుకు మళ్లీ అవకాశం

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్న చోట్ల ఎస్‌ఈసీ చర్యలు తీసుకుంటోంది. నామినేషన్ల బలవంతపు ఉపసంహరణల పైనా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. మరో 14 వార్డులకు నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించింది.

chance to nominations in the seats of candidates death after nomination in muncipal elections
chance to nominations in the seats of candidates death after nomination in muncipal elections

నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల నివేదిక మేరకు మళ్లీ నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించింది. తిరుపతిలో 6, పుంగనూరులో 3, రాయచోటిలో ఇద్దరికి నామినేషన్‌కు అవకాశం కల్పించింది. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3లోగా నామినేషన్ దాఖలుకు ఎస్​ఈసీ సమయం కేటాయించింది. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు విధించింది.

నామినేషన్ వేసేందుకు అవకాశం ఉన్న వార్డులు

  • తిరుపతిలోని 2, 8, 10, 21, 41, 45 వార్డులు
  • పుంగనూరులో 9, 14, 28 వార్డులు
  • రాయచోటిలో 20, 31 వార్డులు
  • కడప జిల్లా ఎర్రగుంట్లలోని 6, 11, 15 వార్డులు
Last Updated : Mar 4, 2021, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details