ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని నిలదీయండి' - జగన్ పై మండిపడ్డ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌ రెడ్డి

ప్రత్యేక హోదా విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌ రెడ్డి విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం మోసపూరితంగా వ్యవహరిస్తోందని.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పోరాడాలని ముఖ్యమంత్రి జగన్​కి సూచించారు.

పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌ రెడ్డి
పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌ రెడ్డి

By

Published : Feb 6, 2020, 5:55 PM IST

వైకాపాపై పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌ రెడ్డి విమర్శలు

రాష్ట్ర అభివృద్ది పట్ల కేంద్రం మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంపై పోరాడాలని ముఖ్యమంత్రి జగన్​ను కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాయితీ ఇస్తానని పక్కదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. ముస్లింలకు, మైనారిటీలకు గొడ్డలిపెట్టుగా మారిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీల విషయంలో జగన్మోహన్‌రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని జగన్​ని కోరితే...పార్లమెంట్‌లో బిల్లుపై భాజపాకి మద్దతిచ్చి బయట మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details